టీవి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
టీవి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

16, మార్చి 2021, మంగళవారం

జల జల జలపాతం - ఈటీవీ

సినిమాలో హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ కన్నా వీళ్ళ కెమిస్ట్రీ ఫిజిక్సూ బయాలజీ అన్నీ టూమచ్ గా ఉన్నట్లున్నాయ్ కదా. అంతా బానే ఉంది కానీ ఆదివారం మధ్యాహ్నం భోజనాలు చేస్తూ కుటుంబ సమేతంగా టీవీ చూసే సమయంలో ఈ పాట ప్రసారం చేయడం మాత్రం... హ్మ్.. ఎందుకులెండి.. ఏమైనా అంటే రిమోట్ లేదా అంటారు.. సినిమాలోని ఒరిజినల్ వీడియో ఈ పోస్ట్ చివర ఉంది.

ఈడియో ::

27, సెప్టెంబర్ 2017, బుధవారం

సైసైసయ్యారే - ఈటీవి బ్రేకింగ్ ఆల్ బారియర్స్

ఈ వీక్ అంటే నిన్న మంగళవారం టెలికాస్ట్ అయిన ఎపిసోడ్ చూశారా లేకపోతే ఇక్కడ చూడండి. జగదేక వీరుడు అతిలోక సుందరి నుండి "యమహో నీ యమ" , సాహస వీరుడు సాగరకన్య నుండి "మీనా మీనా" , అల్లరి మొగుడు చిత్రం నుండి "నీలిమబ్బు నురగలో" పాటలకు సంబంధించిన విశేషాలు వివరించారు. అండ్ ఈ చివరి పాటకు స్టేజ్ పై చేసిన పెర్ఫార్మెన్స్ కళ్ళు తిరిగే రేంజ్ లో ఉంది. స్టేజ్ పైనే ఆర్టిస్టులని నీళ్ళలో తడిపేసి ఏ వానపాటకూ తీసిపోని విధంగా చిత్రీకరించేశారు. అది చూశాక ఈటీవీ బ్రేకింగ్ ఆల్ బారియర్స్ అనిపించి షేర్ చేస్తున్నా..

6, సెప్టెంబర్ 2017, బుధవారం

కొబ్బరిచిప్పల పాటకి దర్శకేంద్రుడి వివరణ...

ఆమధ్య రాఘవేంద్రరావుగారిపై తాప్సీ కామెంట్స్ చేసిందని చెలరేగిన దుమారం గుర్తుండే ఉంటుంది కదా.. ఆ ఇంటర్వ్యూలో తాప్సి మాట్లాడినది "ఝుమ్మంది నాదం" సినిమాలో "ఏం చక్కగున్నావ్ రో" అన్న పాట గురించి. రాత్రి వచ్చిన ఈటీవీ సైసైసయ్యారే ప్రోగ్రామ్ లో దర్శకేంద్రుడు ఆ పాటలో తను గుమ్మడి కాయలు కొబ్బరికాయలు వాడటం వెనక తన ఉద్దేశ్యం ఏవిటో వివరించారు చూడండి.. తన మిడాస్ టచ్ పై ఎన్నో ఆశలు పెట్టుకుని వచ్చిన తాప్సీకి ఆ రెంటితో దిష్టి తీసి ఆ అమ్మాయ్ కెరీర్ తారాస్థాయికి చేరుకోవాలని అలా వాడారట.


23, ఆగస్టు 2017, బుధవారం

ఈటీవీ - సై సై సయ్యారే...

ఒకప్పుడు "అంతరంగాలూ అనంత మానస చదరంగాలూ", "ఓ కళంకిత కళలకే అంకితా" అంటూ వ్యధాభరిత సీరియల్స్ కు కుటుంబకథా చిత్రాలకూ, టెలీఫిల్మ్స్ కు ప్రాముఖ్యతనిస్తూ ఫ్యామిలీ ఆడియన్స్ కు మాత్రమే పరిమితమయేది ఈటీవీ. అయితే నాలుగేళ్ళ క్రితం జూలు విదిల్చి మారుతున్న అభిరుచులను దృష్టిలో పెట్టుకుని ’జబర్దస్త్’ లాంటి ప్రోగ్రాములతో యువతని, ముఖ్యంగా మాస్ ని ఆకట్టుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. అందులో విజయం సాధించి తామూ ఎందులోనూ తక్కువ కామని నిరూపించింది.
  
అంతే కాదు సాధారణంగా సభల్లోనూ, ఇంటర్వ్యూలలోనూ మాట్లాడని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావును ఒప్పించి మొదటిసారిగా "సౌందర్యలహరి" పేరిట ఆయన సినిమాల గురించిన కబుర్లను ఆయనతోనే చెప్పిస్తూ ఒక టెలివిజన్ సిరీస్ ని విజయవంతంగా నడిపింది. ఇపుడు అదే స్ఫూర్తితో మరో అడుగు ముందుకు వేసి, రాఘవేంద్రరావు గారి చిత్రాల్లోని పాటలను ఇప్పటి కొరియోగ్రాఫర్స్ కి ఇస్తే ఎలా కంపోజ్ చేస్తారో పరీక్ష పెడుతూ ఒక సరికొత్త ప్రోగ్రామ్ ను డిజైన్ చేసింది. అదే ’సైసైసయ్యారే’ అనే ప్రోగ్రామ్. 

రాఘవేంద్రరావు గారంటేనే సెన్సువాలిటీకి పెట్టిందిపేరు మరి ఆయన పాటల గురించి ప్రత్యేకంగా చెప్పాలా. ఇందులోనివి ఐటం సాంగ్స్ కాకపోయినా కూడా ఈ బ్లాగ్ చూసే ఇంట్రస్ట్ ఉన్న రసికులకు ఖచ్చితంగా నచ్చుతుందనిపించి ఈ మొదటి ఎపిసోడ్ షేర్ చేస్తున్నాను. రకుల్ ప్రీత్ సింగ్ అతిథిగా వచ్చిన దీనిలో "కూలీ నంబర్ వన్" చిత్రం లోని ’కలయా నిజమా’, "ముగ్గురు మొనగాళ్ళు" చిత్రం లోని ’రాజశేఖరా’, "బొంబాయి ప్రియుడు" చిత్రంలోని ’రాజ్ కపూరు సినిమాలోని’ పాటల ఒరిజినల్ చూపించి, ఆపై డాన్స్ పెర్ఫార్మెన్స్ కూడా చూపించారు. ఆసక్తి ఉన్న వారు చూసి ఎంజాయ్ చేయండి.

’ఈటీవీ’లో ప్రతి మంగళవారం రాత్రి తొమ్మిది గంటల ముఫ్ఫై నిముషాలకు ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది.